ఇలాంటి నియంత పోకడల వల్లే 11 సీట్లే మిగిలాయి.. ఇక 2.0 అంటే అదీ ఉండదు! జగన్పై చీఫ్ విప్ ధ్వజం!
Wed Feb 12, 2025 15:59 Politics![](http://andhrapravasi.com/wp_dashboard/post_images/జగన్_పై చీఫ్ విప్ ధ్వజం!.202502125615.jpg)
'నేను అసెంబ్లీకి రాను, ఇంటి నుంచే మాట్లాడతా.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి' అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. 'ఇలాంటి నియంత పోకడల వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇక 2.0 అంటే ఆ 11 సీట్లూ రావు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభకు రాననడమేంటి? ప్రజలు హోదా ఇవ్వకపోయినా, జగన్ కోరుకోవడం సిగ్గు చేటు' అని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 'ప్రజా సమస్యల పరిష్కారం పట్ల జగన్కు ఆసక్తి లేదని స్పష్టమవుతోంది. ఇది ఆయన అహంకారానికి నిదర్శనం. ఆత్మాభిమానం ఉన్నవారైతే శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటారా? ఏ రోజూ సభకు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడని వైకాపా ఎమ్మెల్యేలకు జీతం తీసుకునే హక్కు ఉందా' అని ఆంజనేయులు ప్రశ్నించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..
వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!
చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #psychojagan #assembly
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.